Showing posts with label news. Show all posts
Showing posts with label news. Show all posts
Tuesday 13 June 2017
Friday 9 June 2017
national, news
Mirchi Today
23:21
ఆధార్ కార్డ్ ను పాన్ కార్డ్ తో లింక్ చేయడం ఎలా
ఆధార్ కార్డ్ ను పాన్ కార్డ్ తో లింక్ చేయడం చాలా సులభం.ఒక్క మెసేజ్ తో మీ ఆధార్ కార్డ్ ను పాన్ కార్డుతో జూలై 1 లోపు తప్పని సరిగా లింక్ చేసుకోండి.మీరు చేయవలసిందల్లా మీ ఆధార్ కార్డ్ తో నమోదైన ఫోన్ నెంబర్ తో UIDPAN అని టైపు చేసి స్పేస్ ఇచ్చి AADHAR NUMBER ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి మీ పాన్ నెంబర్ ను ఎంటర్ చేసి 567578 లేదా 56161 అనే నెంబర్ కు మెసేజ్ పంపండి.
Tuesday 2 May 2017
news, TS news
Mirchi Today
22:43
తెలంగాణ విద్యుత్ శాఖలో 13,357 ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ ఎత్తున నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ల పరిధిలో జూనియర్ లైన్మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 1500 వరకు నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో విద్యుత్ శాఖలోని దాదాపు పది వేల మందికి వెంటనే పదోన్నతులు కల్పించడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Saturday 29 April 2017
news, TS news
Mirchi Today
13:35
తెలంగాణ నీటి మాస్టారు ఇక లేరు. ప్రత్యేక ఉద్యమంలో జలపాఠాలు బోధించిన విద్యాసాగర్ రావు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యాసాగర్ రావును క్యాన్సర్ రక్కసి వెంటాడింది. కీమోథెరపీ చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది.
తెలంగాణ నీటి పారుదల రంగానికి విద్యాసాగర్ రావు జీవగర్ర లాంటి వారు. ఉమ్మడిరాష్ట్రంలో తాగు,సాగునీటి రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాడిన వ్యక్తి. ప్రజలకు అర్ధమయ్యేలా నీళ్ల పంపిణీ అన్యాయాలను వివరించిన ఇంజనీర్. నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెంలో 1939 నవంబర్ 14న విద్యాసాగర్ రావు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీలో పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1979లో యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ నుంచి జలవనరుల విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అమెరికాలో కొలరాడో యూనివర్సిటీ నుంచి వాటర్ రిసోర్సెస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమో కూడా చేశారు. నీటి వనరులు వాటి వినియోగంపై పూర్తి అవగాహన కలిగిన జలవనరుల నిపుణుడు విద్యాసాగర రావు. 1997లో చీఫ్ ఇంజినీర్గా కేంద్ర జలవనరుల శాఖలో పదవీవిరమణ చేశారు. కేంద్ర ప్రణాళికాసంఘం... 12వ పంచవర్ష ప్రణాళిక వర్కింగ్ గ్రూపులో సభ్యులుగా పనిచేశారు. నాబార్డు, ప్రపంచబ్యాంక్ సంబంధిత ప్రాజెక్టులకు... కేంద్ర ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ప్రాజెక్టు సలహాదారుగా పనిచేశారు.
Wednesday 26 April 2017
news, TS news
Mirchi Today
21:18
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయొద్దని తెలంగాణా జీవో కొట్టివేసిన హైకోర్ట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామన్న ప్రభుత్వ హామీపై హైకోర్టు నీళ్లు చల్లింది. దీనికి సంబంధించిన జీవోను కొట్టవేసింది.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 16 జీవోను కొట్టేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది.
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో 16ను తీసుకొచ్చింది. అయితే దీనికి వ్యతిరేకిస్తూ ఉస్మానియా విద్యార్ధులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయస్థానం బుధవారం తాజాగా ఆదేశాలను జారీ చేసింది. 1996 తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిన కోర్టు.. ఈరోజు దీనికి సంబంధించిన జీవో 16 ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.
Monday 17 April 2017
news, TS news
Mirchi Today
23:11
సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సుప్రీం నిరాకరణ
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు తీర్పును న్యాయస్థానం సమర్ధించింది. వారసత్వ ఉద్యోగాలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనను హైకోర్టు గతంలో రద్దుచేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను
ఆశ్రయించింది.
Wednesday 12 April 2017
national, news
Mirchi Today
23:50
ఇలా చేయకపోతే మీ బ్యాంకు ఎకౌంట్లు బ్లాక్ అవుతాయి
కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30లోపు బ్యాంకు ఖాతాలకు ఆధార్ వివరాలను అనుసంధానం చేయాలని ఖాతాదారులకు ఐటీ శాఖ సూచించింది. లేని పక్షంలో బ్యాంకు అకౌంట్ బ్లాక్ చేస్తామని కూడా హెచ్చరించింది. అంతేకాదు, జులై 2014 నుంచి ఆగస్ట్ 2015 లోపు బ్యాంకు ఖాతా తెరిచిన వారు ఆధార్ వివరాలతో పాటు కేవైసీ వివరాలను కూడా సదరు బ్యాంకుకు సమర్పించాలని సూచించింది. విదేశీ పన్నుల అమలు చట్టానికి లోబడి ఖాతాదారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఐటీ శాఖ కోరింది. ఈ డెడ్లైన్కు లోబడి అందరూ వివరాలు సమర్పించాలని లేని పక్షంలో ఖాతాను బ్లాక్ చేస్తామని, ఆ తర్వాత ఖాతా నుంచి ఎటువంటి లావాదేవీలకు అవకాశం ఉండదని ఐటీ శాఖ తేల్చి చెప్పింది. సదరు బ్యాంకులు కూడా ఈ మేరకు ఖాతాదారులను అప్రమత్తం చేయాలని సూచించింది.
Thursday 6 April 2017
national, news
Mirchi Today
22:26
మూడు నెలల సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ను వెనక్కి తీసుకోనున్న రిలయన్స్ జియో
రిలయన్స్ జియోకు ట్రాయ్ భారీ షాక్ ఇచ్చింది. 15 రోజుల పాటు పొడిగించిన జియో ప్రైమ్ ప్లాన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని గురువారం ఆదేశించింది. అలాగే మూడు నెలల సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ను కూడా వెనక్కి తీసుకోవాలని రిలయన్స్ జియోకు సూచించింది.
దీనిపై స్పందించిన రిలయన్స్ జియో, ట్రాయ్ ఆదేశాలను తాము గౌరవిస్తామని పేర్కొంది. రూ.303కు రిఛార్జ్ చేసుకుంటే మూడు నెలలపాటు వర్తించే సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్పై సమీక్షించి వెనక్కి తీసుకుంటామని రిలయన్స్ జియో గురువారం ప్రకటించింది.
Sunday 2 April 2017
news, TS news
మంథని మండలం ఖా నాపూర్ గ్రామానికి చెందిన మంథని మధూకర్ మా ర్చి 14వ తేదీన అనుమానా స్పద స్థితిలో ఖానాపూర్ శివారులోని ముళ్లపోదలో శవమై కనబడగా, అతని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మంథని పోలీ సులు అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేయడం జరిగింది. కాగా మధుకర్ మృతి కేసుపై శనివారం మధ్యాహ్నం పెద్దపల్లి డిసిపి విజేయంద ర్రెడ్డి, మంచిర్యాల డిసిపి జాన్ వెస్లి, గోదావరిఖని ఎసిపి అపూర్వ రావులు విచారణ చేపట్టారు. మధుకర్ శవం లభ్య మైన ఖానాపూర్ శివారులోని ముళ్లపోదల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఖానాపూర్కు వెళ్లి మధు కర్ మృతికి సంబంధించిన విషయాలను అతని అన్నయ్య చిరంజీవితో పాటు గ్రామస్ధులను అడిగి తెలుసుకున్నారు.
Mirchi Today
19:29
ప్రేమించిన నేరానికి యువకుడి దారుణ హత్య | ప్రేమించడం నేరమా
మంథని మండలం ఖా నాపూర్ గ్రామానికి చెందిన మంథని మధూకర్ మా ర్చి 14వ తేదీన అనుమానా స్పద స్థితిలో ఖానాపూర్ శివారులోని ముళ్లపోదలో శవమై కనబడగా, అతని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మంథని పోలీ సులు అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేయడం జరిగింది. కాగా మధుకర్ మృతి కేసుపై శనివారం మధ్యాహ్నం పెద్దపల్లి డిసిపి విజేయంద ర్రెడ్డి, మంచిర్యాల డిసిపి జాన్ వెస్లి, గోదావరిఖని ఎసిపి అపూర్వ రావులు విచారణ చేపట్టారు. మధుకర్ శవం లభ్య మైన ఖానాపూర్ శివారులోని ముళ్లపోదల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఖానాపూర్కు వెళ్లి మధు కర్ మృతికి సంబంధించిన విషయాలను అతని అన్నయ్య చిరంజీవితో పాటు గ్రామస్ధులను అడిగి తెలుసుకున్నారు.
మంథని మధుకర్ కుటుంబసభ్యులు కోరితే మధుకర్ శవానికి రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు తా ము సిద్దంగా ఉన్నామని, అయితే సిపికి గానీ, తమ కు గానీ, ఎసిపికి గానీ రీ పోస్టుమార్టం కోసం అతని కుటుం బసభ్యుల నుంచి ఏలాంటి వినతులు రాలేద న్నారు. శనివారం మధ్యాహ్నం మంథని పోలీ సు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. మధుకర్ కుటుంబసభ్యు ల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి క్రింద మంథని ఎస్ఐ ఉపేందర్రావు కేసు నమోదు చేసు కోని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
మంథని మండలం ఖనాపూర్కు చెందిన మంథని మధూకర్ వెంకటపూ ర్కు చెందిన శీరిష అనే యువతిని ప్రేమించడం జరిగిందని తమకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నార ని, అయితే సదురు యువతి సైతం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించ గా, ప్రస్తు తం చికిత్స పోందుతున్నదని, ఆమె పూర్తిగా కోలుకో ని వివరాలు తెలిపితే ఈ కేసుకు సంబంధించి అస లు నిజాలు బయటపడుతాయన్నారు. కేసును విచా రణ జరిపించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
Saturday 1 April 2017
national, news
Mirchi Today
12:01
ఇవాళ్టి నుంచి తగ్గే పెరిగే వస్తువుల ధరలు
ఆర్ధిక సంవత్సరం శనివారం నుంచే మొదలు కానుంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యక్ష, పరోక్ష పన్నులను రివైజ్ చేశారు. అవి శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. వాటి ప్రకారం కొన్ని వస్తువుల రేట్లు పెరగనున్నాయి..మరి కొన్ని వస్తువుల రేట్లు తగ్గనున్నాయి.
పెరిగేవి..
సిగరెట్లు, పాన్ మసాల, పేపరు చుట్టిన, చేతితో తయారు చేసిన బీడీలు, పొగాకు ఉత్పత్తులు, ఎల్ ఈడీ దీపాల విడిభాగాలు, వెండి పతకాలు, 99.9%స్వచ్ఛత ఉన్న వెండి నాణేలు, సాల్టెడ్ జీడి పప్పు ధరలు పెరగనున్నాయి, భారత్లో తయారయ్యే మొబైల్ఫోన్లు, ఫోన్లలో వాడే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీ)లను ఫోన్ తయారీ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. భారతలో తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం.. అలా దిగుమతి చేసుకునే పీసీబీలపై ప్రత్యేక అదనపు డ్యూటీ విధించింది.కార్లు,మోటారు సైకిళ్ల బీమా ఇవాళ్టి నుంచి పెరగనుంది.
తగ్గేవి…
సౌర శక్తితో పనిచేసే ఉపకరణాలు, ఇళ్లల్లో వాడే ఆర్వో వాటర్ ఫిల్టర్లు, వాటిలోని ఆర్వో కాంపొనెంట్ల డ్యూటీ రేట్లు త గ్గించినందున వాటి ధరలు తగ్గనున్నాయి. ఆన్ లైన్ రైల్వే టికెట్లు, లెదర్ తో తయారయ్యే ఉత్పత్తుల్లో కొన్ని వస్తువులు, పీఓఎస్ యంత్రాలు/ కార్డులు, ఫింగర్ ఫ్రింట్స్ ఆధారంగా పని చేసే యంత్రాలు, రక్షణ బలగాలకు వర్తించే సామూహిక బీమాకు సంబంధించినవి తగ్గనున్నాయి.
Monday 20 March 2017
news, singareni jobs, TS news
SCCL కాంట్రాక్టు వర్కర్స్ సమ్మె 6వ రోజుకు చేరుకుంది ,సమ్మెలో భాగంగా ఈరోజు గోలేటి,బెల్లంపల్లి,మందమర్రి,శ్రీరాంపూర్ డివిజన్లతో పాటు రామగుండంలోని 3 డివిజన్లలోని కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.SCCL కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్స్ JAC సూచన మేరకు ALC ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరిగింది.ఈ ముట్టడి కార్యక్రమానికి SCCL కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ JAC, T JAC, కాంగ్రెస్,బీజెపి, తెలంగాణ ప్రజా సంగాల JAC,RGM కాంగ్రెస్ కార్పోరేటర్స్ పాల్గొని SCCL కాంట్రాక్టు వర్కర్స్ డిమాండ్స్ నోటికు ఇచ్చారు,సింగరేణితో చర్చించి మా న్యాయమైన డిమాండ్స్ తీర్చాలని తెలిపారు.
Mirchi Today
22:00
6వ రోజుకు చేరుకున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
SCCL కాంట్రాక్టు వర్కర్స్ సమ్మె 6వ రోజుకు చేరుకుంది ,సమ్మెలో భాగంగా ఈరోజు గోలేటి,బెల్లంపల్లి,మందమర్రి,శ్రీరాంపూర్ డివిజన్లతో పాటు రామగుండంలోని 3 డివిజన్లలోని కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.SCCL కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్స్ JAC సూచన మేరకు ALC ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరిగింది.ఈ ముట్టడి కార్యక్రమానికి SCCL కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ JAC, T JAC, కాంగ్రెస్,బీజెపి, తెలంగాణ ప్రజా సంగాల JAC,RGM కాంగ్రెస్ కార్పోరేటర్స్ పాల్గొని SCCL కాంట్రాక్టు వర్కర్స్ డిమాండ్స్ నోటికు ఇచ్చారు,సింగరేణితో చర్చించి మా న్యాయమైన డిమాండ్స్ తీర్చాలని తెలిపారు.
Subscribe to:
Posts (Atom)